Tuesday 29 May 2012

మనకి కోపం ఎందుకు వస్తుంది!2


 
           ముందుగా ఎవరికి వారు తమ   మానసిక పరిస్థితిని విశ్లేషించుకోవాలి. ప్రస్తుతమున్న సమాజంలో మనకు ఎన్నో అస్తవ్యస్థ  పరిస్థితులు కనిపిస్తున్నాయి.గత కాలంలో జీవితంలో ఇంత వేగం లేదు.ఇంత పని ఒత్తిడి లేదు. సంపా దించాలనే కోరిక ఇంతగా లేదు.మనుషుల కింత ఆరాటం లేదు.ఉమ్మడి కుటుంబ వ్యవస్థల్లో పెద్దలు చెప్పిన మాటలు వింటూ ఇటు ఇంట్లోను బయట సానుకూలంగా, మర్యాదగా ప్రవర్తిస్తూ నీతిగా,నిజాయితీగా బ్రతుకుతూ వుండే వారు. జ్ఞానం పెరిగి సంపాదనా కాంక్ష పెరిగిన తర్వాత కుటుంబాలు వేరయ్యాయి.పెద్దల సలహాలు,సూచనలు లేక ఇటు కు టుంబం లోను,బయట మనిషి ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు.ఈ ఒత్తిడిలో ఏ చిన్నవిషయంలో నైనా తనకు వ్యతిరేకమైన సంఘటన జరిగితే తట్టుకోలేక వెంటనే అనాలోచితంగా ప్రతిస్పందిస్తున్నారు.అది కోపం రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో భార్యా పిల్లలపై బయ టి వ్యక్తులపై ఇలా కోపాన్ని వ్యక్త పరుస్తుంటారు .కొంత మంది దానిని లోలోన అణచుకొని మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు.
     మరి కాస్త విశ్లేషిస్తే ఎవరయినా కోపాన్నితన కంటే బలహీనుల పైననే చూపిస్తుంటారు.ఉదాహరణకు తల్లి దండ్రులపై ఎదిగిన పిల్లలు,భార్యపై భర్త ఇలాగే కోప్పడుతుంటారు.ఈ మధ్య భార్యలు కూడా భర్తలపై బాగానే కోప్పడుతున్నారు. అధికార్లు తమ క్రింది సిబ్బంది పై కోపగించుకుంటారు.పై అధికార్ల దగ్గర మాత్రం అణకువగా వుంటారు.ఉపాధ్యాయులు విద్యార్థుల పై ఇలాగే కోప్పడుతారు.కాని ఎవరు బలవంతులపై  కోప్పడరు.ఎందుకంటే బలవంతుడు అంతకంటే ఎక్కువ కోపాన్ని ప్రదర్శించటంతో పాటు కొండొకచో కొట్లాటకు దిగవచ్చుకూడా !కాబట్టి కోపానికి కూడా బలవంతుడంటే భయమే!ఈ విధంగా కోపం ప్రదర్శించబడు తుంది.
  తరువాతి వ్యాసం లో కోపం వల్ల నష్టాలు,దాన్ని అధిగమించే తీరు గురించి తెలుసుకుందాము.

Monday 28 May 2012

మనకి కోపం ఎందుకు వస్తుంది?1


        మనిషికి కోపం లేదా ఆగ్రహం ఎందుకు వస్తుంది?.కోపం ఎవరిపై వస్తుంది?కోపం అంటే ఏమిటి?ఏదైనా బాహ్య పరిస్థితి  తనకు అనుకూలంగా లేకున్నా,ఎదుటివారు మనల్నికించ పరిచేలా మాట్లాడినా మన అవకాశాలను ఎవర న్నా దెబ్బ కొడుతున్నారని తెలిసినా మన దగ్గరి వారు మన మాట వినక పోయినా, ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా ఇలా విభిన్న పరిస్థితులలో మన ప్రతిస్పందన కోపం రూపంలో బహిర్గతమవుతుంది .దీని బారిన పడని మనిషి ఉండ డేమో!కాకపోతే ఎంత త్వరగా ఆ స్థితినుండి బయటపడతారు అన్నది వ్యక్తుల స్వభావాన్ని బట్టి ఉంటుంది.
         పై కారణాలనన్నింటితో పాటు  ఒక విషయం చెబితే అందరు  ఆశ్చర్యపోతారు.మనకు చాలా లక్షణాలు వంశపా రం పర్యంగా వస్తాయి.మన తల్లి దండ్రులకు లేదా వారి తల్లిదండ్రులకు గల ఈ లక్షణం జీన్స్ ద్వారా మనకు రావచ్చు. కాబట్టి ఒక రకంగా కోపం ముందుగానే నిర్ణయించబడుతుంది.ఇంకా చెప్పా లంటే మన తల్లిదండ్రులు ప్రవర్తించే విధానా న్ని మనం చిన్నప్పట్నుండి చూస్తుంటాము కనుక అలాగే మన ప్రవర్తన నిర్ణయించబడుతుంది.నూటికి నూరు శాతం కాకపోయినా ఎక్కువ శాతం ఇలా జరిగే అవకాశం వుంది.అలాగే కోపం ప్రదర్శించడం వ్యక్తి నిస్సహాయ స్థితిని కూడా సూచిస్తుంది.ఇంకా ఎన్నో అంశాలు దీనికి కారణమవుతాయి.
       సహజంగా ఈ కోపం రెండు రకాలు.1)ప్రదర్శితమయ్యేది2)లోలోపల వ్యక్తమయ్యేది
కొంత మంది వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి కోపాన్ని ప్రదర్శిస్తుంటారు.మరికొంత మంది వ్యక్తులు ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే ప్రదర్శిస్తారు.చిత్రంగా ఇంకొందరు అసలు కోపాన్ని ప్రదర్శించరు.మరి వారికి కోపం రాదా అంటే వస్తుంది.దానిని అంతర్గతం గా అణచుకుంటారు.అతి తక్కువ మందికి మాత్రమే అంతర్గతంగా కూడా కోపం జనించదు. వారిని మనం ఋషులు అనవచ్చు.మనమందరం మామూలు మానవులం కాబట్టి దీని నుండి ఎలా బయట పడాలో మరో వ్యాసంలో చర్చిద్దాము.
 

Saturday 26 May 2012

ఇదే కదా మరణం ఇచ్చే సందేశం!


                                         
సర్వ బంధాలనుండి విముక్తి
సమస్త బాధలనుండి స్వేచ్చ
కలగన్నవి, పెంచుకున్నవి, పంచుకున్నవి
అన్నింటిని తుంచివేసే సంపూర్ణ స్వేచ్చ
మృత్యువు జీవితానికి చివరి అంచు కాదు
ప్రతి క్షణం మరణ స్ప్రుహ  తో జీవించడం
మనిషి పోగుచేసుకున్నవన్నీ విసర్జించడం
అదే కదా మృత్యువు యొక్క ఆంతర్యం
జీవించడమంటే మరణించడమే 
ప్రతిరోజు పెంచుకున్న బంధాల్ని
ఒక్కొక్కటిగా తుంచుకోవడమే
జీవించి ఉండగానే బంధాలన్నీ వదలగలిగితే
మృత్యువు తర్వాత అదే కదా జరిగేది
జీవిస్తూనే మృత్యువును అనుభూతించడం
అదే సిసలైన ధ్యానం
మరణించడమంటే ప్రేమతో జీవించడం
ప్రేమించగలిగే హృదయం కలిగి ఉండటం
ప్రతి క్షణం మనతో ఉండే నేస్తం మృత్యువు
ప్రతి క్షణం మరణించాలి  మన జ్ఞాపకాలకు
మరు క్షణం జననం ప్రేమిం చటానికి
 క్షణక్షణం జనన మరణ స్పృహ
ఇదే జీవనం సజీవ జీవనం
ఇదే కదా మరణం ఇచ్చే సందేశం         
(జిడ్డు కృష్ణమూర్తి తత్వ సారం మరియు మరణాన్ని దగ్గరగా చూసిన అనుభవం తో ) 

Friday 18 May 2012

ఓ విరిచూపు


                                                        విరిచూపు
                              తను ఎన్నో ఆశ్చర్య కరమైన ప్రశ్నలకి
                                                              గురి అయ్యానంటోంది
                             మరెన్నో అవ్యక్తానుభూతులకు లోనై  
                                                                             ఆలోచిస్తున్నానంటోంది
                             మదిలో చెప్పలేని సందేహాలెన్నో  
                                                             మొగ్గ తొడిగాయంటోంది
                             నా పరిస్థితికి నీ ప్రయత్నాలన్నీ 
                                                             వ్యర్థమే అంటోంది
                             నా కోసం ప్రయాణించే నీ రైలు ఓ జీవితకాలం 
                                                           ఆలస్యం అంటోంది
                              నా హృది నీలాకాశంలా  విస్తరించినపుడు
                              నీ వెందుకు ప్రవేశించలేదు నేస్తమా!
                              నేనందమైన జాబిల్లినని ఇంకాస్త ముందుగా
                              ఎందుకు తెలియజేయలేదు మిత్రమా!
                              అంటూ అల్లరి కనురెప్పల
                         కదలికలు పలికిస్తున్నాయి
                              ఇంకేం మిగిలివుంది సఖుడా! నా దగ్గర
                              అద్భుతమైన నీ ఆరాధనా భావ పరంపరలు తప్ప!
                              మరింకేం చెప్పేది వీధి లైట్ కాంతి 
                              నా మీద పడి  నీ భావాల్ని జ్ఞప్తికి  తెస్తోంది  
                              ఓడ కళాసీ పాట  దూరంగా వినిపిస్తుంది
                              నీ స్వరధుని నన్ను జీవితమంతా
                        పులకరింప జేస్తూనే వుంటుంది  
                               అని కాటుక కనులువాబిస్తున్నట్లుంది
                               ఇంకా ఇలా పలికిస్తుంది చూపు
                                             వుంటాను స్నేహితుడా!
                                        నీ పలకరింపులకు దూరంగా 
                                        నీ     భావనలకు      దగ్గరగా  

Wednesday 16 May 2012

నీ ధ్యానమే!


నింగిని నేనై విశ్వమంతా పరచుకున్నా
నీ జాడను నే కనుగొన  లేకున్నా    
కవితను నేనై నీ కన్నుల్లో వికసించినా
కలనైనా కనిపించకున్నావు
కమ్మని పాటలో నిన్నునే వర్ణించినా
తియ్యని పిలుపైనా నీనుండి రాలేదు
ఊహవు నీవై మదిని నిండి
                                     ఊయల లూగావు
అనుభూతివి నీవై హృదిని నింపి
                                       ఎక్కడో వున్నావు
ఆశను పెంచి
వేదన నింపి
కవితకు అందక
కలలకు చిక్కక
కన్నీటిని తెప్పించి
కనుమరుగయిన  అనురాగమయి
తుది దాకా  నీ గానమే!
చివరి వరకు నీ ధ్యానమే!
       
 

Sunday 13 May 2012

అమ్మకు పాదాభివందనం.


అమ్మ అంటే మనల్ని సృష్టించిన సృష్టి కర్త.
       మనల్ని సృష్టించడం మే కాక భూమి మీద పడ్డ మరుక్షణం నుంచి స్తన్యమిచ్చి ఆకలి తీరుస్తూ ,జోల పాడి లాలి పోస్తూ ,ఊయలూపి  నిద్ర పుచ్చుతూ,కన్ను మూసినా,తెరిచినా మన ప్రక్కనే ఉండి  గమనిస్తూ,మన ప్రతికదలికను మనసారా ఆస్వాదిస్తూ ,ఆనందిస్తూ ,గోరుముద్దలు తినిపిస్తూ ,మారాం చేస్తే చంక నెక్కిం చుకొని చందమామను చూపి స్తూ కథలు చెబుతూ ,చిటికెన వ్రేలు పట్టుకొని నడక నేర్పుతూ,అల్లరి  ఆటల మురికిని వదలగొట్టేలా స్నానం చేయిస్తూ ,మనం చేసుకోలేని ప్రతిపనిని తాను చేస్తూ,ఇష్టమైనవి వండి పెడుతూ, మన బట్టలుతుకుతు,మన పుస్తకాలు సర్దుతూ ,తల దువ్వుతూ,మన చిరు తిండికి  డబ్బులిస్తూ,మన ప్రక్కన కూర్చుని చదివిస్తూ,అర్థం కాకపోతే విడమరచి చెబుతూ ,బాధలో వున్నప్పుడు ధైర్యం చెబుతూ,నాన్నతో మాట్లాడి మన కోరికలకు డబ్బు సమకూరుస్తు,మనం జీవితం లో స్థిర పడితే పొంగిపోతూ,మనకు సరిజోడీ ని వెతికి మన జీవితానికి పరిపూర్నత్వాన్నిస్తూ,మన పిల్లలకు కూడా సేవ చేస్తూ,మరణం వరకు మనసేవలో తరించే నిస్వార్థ జీవి ,ప్రేమ మూర్తి అమ్మకు పాదాభివందనం.

Friday 11 May 2012

ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి నేడే






  with anniebesent


       ప్రపంచంలోని తత్వవేత్తలలో  జిడ్డు కృష్ణమూర్తి ని అగ్రగణ్యుడుగా చెప్పవచ్చు .ఈయన ఆంధ్రప్రదేశ్ లోని మదన పల్లె లో నారాయణయ్య,సంజీవమ్మ లకు 1895 మే 11 న 8 వ బిడ్డగా జన్మించారు.ఆరోజుల్లో Annie Besent తియో సాఫికాల్  సొసైటీకి ప్రెసిడెంట్ గావున్నారు .వారు మానవ రూపం లో దేవుడు అవతరించి ప్రజలను రక్షిస్తాడు ,తనే ప్రపంచగురువు పాత్ర పోషిస్తాడు అని నమ్ముతూ వుండేవారు.ఆయన రాక కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయటం కోసం order of the star అనే సంస్థను స్థాపించారు.1911 లో అనీబీసెంట్ ఆయనను,తమ్ముడు నిత్యానందను గమనించిం ది. ఆమెకుకృష్ణమూర్తిలో కాబోయే జగద్గురువు కనిపించాడు.వారిద్దరిని  శిక్షణకై   England,France పంపించారు.ఆ శిక్షణ సమయంలో  ఆయనలో పూర్తిగా పరివర్తన వచ్చి  మహా ప్రజ్ఞతో ,అపర బుద్ధుడిగా గోచరిం చాడు.తరువాత నిత్యానంద మరణంతో భయంకరమైన దుఖం  అనుభవించి తనకు తాను దుఃఖ విముక్తుడై య్యాడు.ఆయన ఇలా ప్రకటించారు.
  "నా ప్రధాన లక్ష్యం ఒక్కటే_వ్యక్తి స్వేచ్చ .అన్ని భయాలనుండి,బంధాలనుండి మనిషిని  విముక్తి చెయ్యాలి."
      1929 లో  order of the star సమావేశంలో దానిని రద్దు చేసి నేను ఎవరికీ గురువును కాను నాకెవరు అనుచ రులు లేరు అని ఆ సంస్థ ఆస్తుల్ని సంపదలని వారికి పంచిపెట్టాడు.అప్పటినుండి  1986లో చనిపోయేంత వరకు ప్రపంచ మంతా పర్యటిస్తూ,ప్రజలను కలుస్తూ, చర్చిస్తూ గురువు లాగా కాకుండా,ఒక స్నేహితుడి లాగా వ్యవహ రించాడు.ఆయన పుస్తకాల జ్ఞానంతో కాక మానవుడు ఎదుర్కొనే పరిస్థుతులపై  తన అంతరదృష్టి తో,పవిత్రమైన మనస్సు తో,ఒక ప్రత్యేకమైన తత్వం చెప్పకుండా జీవిత సమస్యలను ప్రస్తావిస్తూ వెళ్ళారు.
           ఆయన ఏ మతానికి,ప్రాంతానికి,దేశానికి చెందకుండా ,ఏ సంస్థను స్థాపించకుండా ,ఏ తత్వాన్ని ప్రచారం చేయకుండా ప్రపంచమంతా తిరుగుతూ తూర్పు,పశ్చిమ దేశాల్లో ,అన్ని కాలాల్లోని తత్వవే త్తల్లో  గొప్ప స్థానం సంపాదించుకున్నారు.
*ప్రకృతి సృష్టించిన ఈ అందమైన భూమిని,పర్యావరణాన్ని ,ఇందులో నివసిస్తున్న మానవులను రక్షించుకోవాలని పిలుపిచ్చారు.
ఆయన బోధనల్లోని ముఖ్యాంశాలు.
*సత్యానికి మార్గం ,పథం అంటూ ఏమీ లేదు.
* అన్ని జీవనకళల్లోకి  ధ్యానం ఉన్నతమైనది.
*అసలైన విప్లవం పేరు ప్రేమ.మనిషిలోను,సమాజం లోను మార్పు తీసుకు రాగలిగింది ప్రేమ.
*మనలో మానసిక విప్లవం రావాలి.గతాన్నిపూర్తిగా నాశనం చేయగల విప్లవం.
*జ్ఞానం వలన మనిషి సమస్యలు పరిష్కారం కావు.సమస్య పరిష్కారానికి వివేకం కావాలి.
*ప్రేమ నిండిన మనస్సులోనే సత్య దర్శనం అవుతుంది.
*హృదయం చెప్పింది వినండి.హృదయం చెప్పినట్లు చేయండి.వెలుగు మీలోనే వుంది.
*నిన్నునీవు  గమనించు.అదే ధ్యానం.ధ్యానం అన్నది పరిపూర్ణ స్వేచ్చ.
*జీవించి ఉండగానే బంధాలన్నీ వదిలి మనసు శూన్యం అయితే ....మృత్యువు తర్వాత అదేకదా స్థితి.జీవిస్తూనే అలా మృత్యువును అనుభూతించడం  గొప్ప అనుభవం.అదే సిసలైన ధ్యానం.
*ప్రేమ,అనురాగాలతో మనిషిలో మార్పు వస్తుంది.మనలో ద్వేషం వుంటే ఇవి ఏర్పడవు.
*మరో జన్మ లేదు.భూమి మీద పుట్టిన ప్రతి జీవి నశిస్తుంది.ఆ రహస్యం తెలుసుకోవడమే జ్ఞానం.
జీవించడం అంటే ప్రతిరోజు పెంచుకున్న అనుబంధాల్ని ఒక్కొక్కటిగా తెంచుకోవడం.
*వివేచనతో,విచక్షణతో,అవగాహనతో.చైతన్యంగా ,స్వేచ్చగా,వర్తమానం లో వినడం అనేది జీవితంలో అన్నింటి కన్నా ముఖ్యం.మనం ఏ  పని చేసినా దానిని ప్రేమతో చేయాలి.
*సత్యం మీ నిత్య జీవితం లోని ప్రతి కదలిక లోను వున్నది.
*సత్యాన్వేషణమే నిజమైన విద్య.
*విద్య యొక్క  కర్తవ్యం ప్రజ్ఞావంతులైన సమగ్ర మానవులను,పూర్ణ పురుషులను సృష్టించడం.
కృష్ణ మూర్తి  సంభాషణలే తర్వాత పుస్తకాలుగా వెలువడ్డాయి.వాటిలో ముఖ్యమైనవి .
1)Education and the significance of life
2)commentaries on living (written by krishna murti)
3)The First and the last Freedom
4)note book
4)freedom fro the known
5)beyond violence
6)The awakaning of inelligence
7)A World in a crisis
8)ఈ విషయమై ఆలోచించండి.
9)గరుడ యానం
10)నీవే ప్రపంచం
11)విద్య:అందు జీవితమునకు గల ప్రాధాన్యం
జీవితాన్ని  గురించి  క్షుణ్ణంగా  తెలుసుకోవాలనుకునే  వారు ఆయన రచనలు,బోధనలను పరిశీలించాలి.
ఆయన విద్యకు జీవితం లో చాలా ప్రాముఖ్యత ఇచ్చారు.అందుకై అమెరికా,ఇంగ్లాండ్ ,ఇండియా లలో
స్కూల్స్ ఏర్పాటు చేసాడు.
ఈ దిగువ వెబ్ సైట్  లలో ఆయన గురించి మరింతగా తెలుసుకోవచ్చు.

*     www.kfionline.org
*     www.jkrishnamurti.org

The official Krishnamurti Schools are:

కృష్ణ మూర్తి చే స్థాపించబడ్డ స్కూల్స్ .

1)USA - Oak Grove School
220 W. Lomita Ave., Ojai, California 93024-1560 USA
Tel: (805) 646-8236 Fax: (805) 646-6509
Email: office@oakgroveschool.com
Admissions: enroll@oakgroveschool.com
Web: www.oakgroveschool.com

2)UK - Brockwood Park School
Bramdean, Hampshire, SO24 OLQ, England
Tel: 011-44 (0)1962 771744 Fax: 011-44 (0)1962 771875
Email: info@brockwood.org.uk
Web: www.brockwood.org.uk

3)India - Rishi Valley Education Center
Rishi Valley - 517 352, Chittoor District, Andhra Pradesh, India
Tel: 011 91 8571 62037
Fax: 011 91 8571 68622
Web: www.rishivalley.org
India - Rajghat Education Center

4)Rajghat Besant School, Rajghat Fort, Varanasi
Tel: 91-542-2430336, 2440717, 2441536
Emails: rbskfi@gmail.com, kfirajghat@gmail.com
Webs: www.j-krishnamurti.org, www.rajghatbesantschool.org

5)India - The School "Damodar Gardens"
Besant Avenue, Chennai - 600 020 India
Tel:011 91 44 491 5845
Web: www.theschoolkfi.org

6)India - Bal Anand, Mumbai
Akash Deep, 28 Dongersey
Road Malabar Hill, Mumbai--400 006

7)India - The Valley School Bangalore Education Center
"Haridvanam", 17th K.M. Kanakapura Road,
Thatguni Post, Bangalore - 560 062 India
Tel: 011-91-80-843-5240
Fax: 011-91-80-843 5242
Email: kfiblr@blr.vsnl.net.in
Web: www.jkstudy.org

8)India - Sahyadri School
Sahyadri School, Post Tiwai Hill, Tal. Rajgurunagar, Dist. Pune 410 513
Thatguni Post, Bangalore - 560 062 India
Tel: 011 91 2135 84270/84271/84272
Fax: 011 91 2135 84269
Email: sahyadrischool@freeyellow.com
Web: www.sahyadrischool.org:    

Sunday 6 May 2012

నేడే గౌతమ బుద్ధ జయంతి


                                  ఈ రోజు గౌతమ బుద్ధ జయంతి .మానవాళికి తెలిసిన అతి ప్రాచీన తాత్వికులలో ఆయన ఒకరు.సంక్షిప్తం గా బుద్ధుని గురించి ఆయన బోధనల గురించి తెలుసుకుందాము.ఈయ న అసలు పేరు గౌతముడు..తండ్రి శుద్దోధనుడు,తల్లి మాయాదేవి.క్రీ .పూ 565_485 మధ్య కాలం లో జీవించాడు.తల్లి మరణం తో పినతల్లి మహాప్రజపతి పెంచింది.యుక్తవయస్సు లో యశోధర తో వివాహం అయింది.వారికి ఒక కుమారుడు.పేరు రాహులుడు.నేడే 
       దారుణమైన ,నివారణా సాధ్యమైన మానవాళి కష్టాలు ఆయన అనుభవం లోకి వచ్చాయి ఆకలి అంటురోగాలు,ఆహార కొరత వీటిని ఆపేందుకు మార్గం లేదా అని ఆలోచించాడు.ఇవన్నీ చూస్తూ రాజ భోగాలు అనుభవిస్తూ ఉండటమా!లేక గొప్ప లక్ష్య సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేయడమా!నాటి ప్రజాబాహుల్యం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు ఒక పరిష్కారమార్గాన్ని కనుగొనుటకు అవసరమైన జ్ఞానాన్ని సంపాదించడానికి రాచరిక జీవితాన్ని వదిలి వేశాడు.ఏడు సం:సుదీర్గమైన తపస్సు అంటే పరిశోధన చేసాడు.బుద్ధగయ వద్ద జ్ఞానోదయం అయింది.కఠినమైన శిక్షణ,ఏకాగ్రత అలవరచుకున్నాడు.ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని,ఆలోచనా విధానాన్ని సాధన చేసేందుకు అనుగుణంగా తన శరీరాన్ని మన సును పదును పెట్టుకున్నాడు.బుద్ధుడు అనే బిరుదు ప్రజలు, శిష్యులు ఆయనికి ఇచ్చారు.గౌతముడు ఈ జ్ఞానాన్ని ,మానసిక పరిపక్వతను అద్యయనం,బోధన అనే నిరంతర ప్రక్రియల ద్వారా సంపాదించు కున్నాడు .
       ఆయన బోధనల్లోని ముఖ్యాంశాలు.
*"నా లోపలినుంచి జ్ఞానం ఉదయించిన తర్వాత కోరికల మత్తునుంచి,పునర్జన్మ మత్తునుంచి అజ్ఞానమనే మత్తు నుంచి నా హృదయం ,నామనసు విముక్తి చెందాయి.జ్ఞానం,స్వాతంత్ర్యం నాకు స్వేచ్చను ప్రసాదిం చాయి.పునర్జన్మ లేదని నాకు తెలిసింది.నేను నా లక్ష్యాన్ని చేరుకునాను."
     స్వీయ జ్ఞాన సముపార్జన కోసం దుర్భరమైన కష్టాలు అనుభవించిన అనంతరం గౌతముడు జ్ఞానిగా మారాడు.అప్పటినుండి బుద్ధునిగా పిలవ బడ్డాడు.
*"భావోద్రేకాల ఉచ్చును చేదించడం తెలిసిన వాడిని,జనాన్ని కష్టాల సుడిగుండం నుంచి కాపాడగలిగిన వాడిని,ఐహికవాంఛలకు స్వస్తి పలికి వాటి కాటుకి బలికాకుండా చేయగలిగిన వాడిని.సత్యమనే వెలుగు ద్వారా అజ్ఞానపు చీకటిని చెల్లా చెదురు చేయగలిగిన వాడిని తద్వారా మనిషికి అసలైన నిబ్బాన(నిర్వాన)దశను అందించగల వాడిని నేనే!"
    తాను ప్రవచించింది ఆచరించి చూపిన  మనీషి బుద్ధుడు .ధనం కోసం గాని కీర్తి గాని ఆశించకుండా ఏ వ్యక్తి అయినా వ్యవహరిస్తే అతనే బుద్ధుడు.తనకు తాను ఏ దివ్యత్వాన్ని ఆపాదించుకోలేదు.
   హృదయ బంధనాలు విచ్చిన్నమయ్యాయి.సందేహాలన్నీ  పటాపంచలై,భవబంధాలను ప్రేరేపించే కర్మలన్నీ  నివ్రుత్త మయ్యాయి.పరమ సత్యం తేట తెల్లమయింది.బుద్ధుని హృదయం కరుణతో నిండి పోయింది.
 ఆయన ప్రవచించిన అష్టాంగ మార్గం.
1)సమ్యక్ దృష్టి (మంచి ఉద్దేశాలు)RightViews
2)సమ్యక్ సంకల్పం (మంచి  ఆశలు)Right Aspirations
3)సమ్యక్ వచనం (మంచి  మాటలు)Right Speech
4)సమ్యక్ కర్మ (మంచి ప్రవర్తన)Right Conduct
5)సమ్యక్ జీవనం(మంచి బ్రతుకు దెరువు)Right Livelyhood
6)సమ్యక్ ప్రయత్నం(మంచి వ్యాయామం) Right Effort
7)సమ్యక్ స్మృతి(మంచి మనస్సు,ఆలోచనలు) Right Mindfulness
8)సమ్యక్  సమాధి(మంచి ఉల్లాసం స్వీయ నియంత్రణ)Right Contemplation
               ఇవి బుద్ధుడి తత్వ శాస్త్ర మూలాలు.
    ఈ విశ్వానికి ఒక క్రమబద్దత వున్నదని ,దాని తీరుకు ఒక ఆధారం వున్నదని ప్రకటించాడు.జ్ఞాన శాస్త్రం మీద ఈ ప్రకటన ప్రభావం అపారంగా వుంది.
బుద్ధుడు బౌతిక ఆధ్యాత్మిక వాదాన్ని మేలవించాడు.తన జీవితమంతా ఆత్మ చైతన్యం ,ఆత్మ నియంత్రణ కోసం కృషి చేసాడు.
*కోరికలు,లోభం దుఖానికి కారణం.బాధ,బాధకు మూలం ,బాధా విముక్తి,బాధా విముక్తికి మార్గం--ఈ మహాసత్యాలు సంపూర్ణం గా అవగాహన అయిన తర్వాత జీవన ప్రక్రియ పట్ల మొహం నశిస్తుంది.
*సంపూర్ణంగా మనసా,శారీరకంగా సత్యాన్వేషనే లక్ష్యం.
*అనిత్యమైన అహాన్ని వదిలి నిత్యమైన సత్యాన్ని గుర్తించాలి.
పౌర సమాజానికి ప్రవర్తనా నియమావళిని రూపొందించిన గొప్ప ప్రాచీన తాత్వికుడు బుద్ధుడు.
ఒక కారణం నుంచి మొదలయ్యే వాటన్నింటికి బుద్ధుడు కారణాన్ని వివరించాడు.ప్రతి కారణం ఎలా అంతమవుతుందో కూడా చెప్పాడు.ఇదే మహా జ్ఞాని ప్రవచనం.
 ప్రతి దానికి ఒక కారణం వుంటుంది.ప్రతి కారణానికి తనదైన ప్రభావం వుంటుంది.అనే సత్యాన్ని కనుగొనడం ద్వారా సమకాలీన పాశ్చాత్య తత్వవేత్తల నందరినీ అధిగమించాడు.
*కారణం _ప్రభావం.
   క్రీ.పూ ఆరవ శతాబ్దిలో బుద్ధుడు ఇంతటి సమున్నత శిఖరాలు అందుకోవడం చాల గొప్ప విషయం.
     బుద్ధుడు  తన  80 వ  ఏట క్రీ.పూ 480_485 ప్రాంతం లో చనిపోయాడు.
(కంచ ఐలయ్య గారు ,స్వామి రంగనాదానంద గార్ల  రచనలనుండి సేకరించిన సమాచారాన్ని ఇచ్చాను.వారికి సదా కృతజ్ఞతలు.)
           


Friday 4 May 2012

చెలీ!


                                     విశాల విశ్వంలో నీవు వినిపించని
                                     గీతికలా వున్నావెందుకు
                                     ఆ గీతాన్ని నాకిస్తే శ్రుతి చేసి
                                     మధురంగా పలికించనా
                                సముద్రంలో చిన్న అలవై
                                మిగిలిపోయావెందుకు
                                కెరటంలా ఒడ్డుకు రావా
                                నన్ను నీలో కలుపుకునేందుకు 
                                     వెన్నెల ఆకాశంలో చిన్న
                                     నక్షత్రమై వెలుగుతావెందుకు
                                     పున్నమి వెన్నెలవు నీవైతే
                                     పులకరించే కలువను నేను కానా
                               వాన వెలసిన వేళలో
                               ఒంటరిగా వున్నావెందుకో
                               ఇంద్ర ధనుస్సువు నీవైతే
                               ఆ వింటినారిని నేను కానా
                                    తెలవారిన తర్వాత
                                    ఏటి ఒడ్డున నీటి కోస్తావెందుకు
                                    కొద్దిగా ముందొస్తే  సుప్రభాత సంగీతాన్నై
                                    నీ వీనుల విందు చేయనా
                              చెలీ నా భావాల వీణ లోని
                              ప్రతి తీగను మీటాను
                              ఏ రాగం నిన్ను కదిలించినా
                              ఆ తొలకరి మేఘాని కందించవా  

Thursday 3 May 2012

జాతీయ ఆనంద సూచిక

          ఇంతకు ముందు పోస్ట్ లో  మానవ  జీవిత లక్ష్యమేమిటి? అంటే ఆనందం అని తెలుసు కున్నాము. మరి ఒక దేశం దాన్ని తన జాతి జీవన విధానం గా మలిస్తే ఎలా వుంటుంది.భూటాన్ లా వుంటుంది.అన్ని దేశాలు Gross National Product(GDP)  ను లెక్కిస్తుంటే భూటాన్  మాత్రం Gross National Happieness(GNH) ను లెక్కిస్తుంది.అంటే స్థూల జాతీయ ఆనందం .ఎంత బాగుందో కదా!
                        వారిని పర్యావరణ మైత్రి,సంస్కృతి పరిరక్షణ,సుపరిపాలన,ఆర్ధిక వృద్ది  నిత్య సంతోషం గా వుంచుతు న్నవి.వాళ్ళు ప్రకృతిని విపరీతం గా ప్రేమిస్తారు.అక్కడ 72% అడవులు వున్నాయి .జంతువు లను వేటాడరు ,నదుల్లో చేపలను కూడా పట్టరు .బౌద్ధం వారి జీవన విధానం .ప్రకృతి మా ప్రాణం అంటారు వారు.టి.వి. వారి దేశం లో 1999 లో ప్రవేశించింది.తమకు అంగీకారం కాని చానళ్ళకు అడ్డుకట్ట వేసింది.
               ప్లాస్టిక్ మీద అక్కడ పోరాటం జరుగుతోంది.ఇక్కడ  అన్ని రకాల పొగాకు అమ్మకాలు నిషిద్దమే!ఇక్కడ నీరు,గాలి అత్యంత స్వచ్చంగా వుంటాయి.పర్యావరణాన్ని  పారిశ్రామీకరణ  దెబ్బతీస్తుందని ప్రోత్సాహించటం లేదు.పర్యాటకుల వల్ల కూడా పర్యావరణం దెబ్బ తింటుందని  వారిని నియంత్రిస్తారు.
         ఇంతలా పర్యావరణాన్ని ప్రేమిస్తూ ప్రకృతి లో ఆనందం గా బ్రతుకుతున్న దేశాన్ని,ప్రజలను ఎక్కడా చూడలేమేమో!జీవితాన్ని సంతృప్తిగా ,మనః శాంతిగా గడపడానికి అక్కడి ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రజలంతా దానికి మద్దతు పలుకుతున్నారు.ఓ సారి ఆ దేశాన్ని చూసొద్దామా!
     (మూలం :ఈనాడు ఆదివారం పుస్తకం .వారికి కృతజ్ఞతలు.)