Monday 6 April 2015

అబ్దుల్ కలాం ద్వారా శంఖు స్థాపన చేయబడ్డ అనాధల స్కూల్

             పై విషయం పేపర్ లో చూసిన తరువాత అదీ maartur లో అని తెలిసిన తరువాత వెళదామనిపించింది.కానీ ఒక్కడినే ఎలా అనుకున్నాను.సరే ఎప్పుడో ఒక సారి ఆ స్కూల్ ను చూడాలనుకున్నాను.ఆనంద్ ఫోన్ చేసి కార్లో వెడదామా అనటంతో O.K చెప్పేశాను.నేను,ఆనంద్,రంగయ్య ,DVN ప్రసాద్,T.V. శ్రీనివాస్ తో కలిసి బయలుదేరా ను.మేముండే మార్కాపురం నుండి ఒంగోలు మీదుగా నేషనల్ హైవే పై మార్టుర్ దాటిన తరువాత 2 KM లకు శారదా విద్యా నికేతన్ కనిపించింది. అదే అబ్దుల్ కలాం ఆవిష్కరించ బోయే అనాధల school.
             6 గంటల కల్లా అక్కడికి వెళ్ళాము.60 ఎకరాల్లో ఓ 10 ఎకరాల్లో స్కూల్ ఉంది.అక్కడ మాచెర్ల,వినుకొండ లలో పనిచేసే MARG  స్వచ్చంద నిర్వాహకులు పరిచయమయ్యారు.ఈ స్కూల్ కు వారు 60 మంది పిల్లలను పంపారట.కరీముల్లాఖాన్ అనే ఉపాధ్యాయుడి ద్వారా స్థా పించబడి 2000 మంది వివిధ వృత్తులలో పనిచేసే వారు సభ్యులుగా పనిచేస్తున్నదీ సంస్థ.ఆ సంస్థ లోని  M. పాపిరెడ్డి ,B.నాగరాజు పరిచయమయ్యారు వేదికపై శివారెడ్డి (నటుడు) కొద్దిసేపు మిమిక్రీ చేసారు .
             6:15 కల్లా కలాం గారు వేదిక పైకి వచ్చారు.ఈ స్కూల్ ను స్థాపించిన NRI డాక్టర్ పోలినేని సుబ్బారావు తన తల్లి పేరుతో ఫౌండేషన్ స్థాపించి తన 60 ఎకరాలను(60 కోట్లు విలువ చేసే ) ఈ ఫౌండేషన్ కు దానం చేసాడు. ఆయనకు చిన్నతనంలోనే అమ్మా నాన్న చనిపోవటం తో ఆ లోటు తెలుసుకనుక ఈ స్కూల్ ఏర్పాటు చేసారు.తను ఎలా చదువుకుంది,కాలేయ cancer కు  గురయి బయట పడటం గురించి వివరిస్తుంటే కళ్ళు చెమర్చాయి .cbse syllabus తో 12 వ తరగతి వరకు అన్నిసౌకర్యాలతో (AC HOSTEL,LABS) ఏర్పాటు చేసారు.HIV సోకిన పిల్లలు ,అనాధలు ,తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి ఇందులో ప్రవేశం.ప్రస్తుతం 250మంది ఉన్నారు.పిల్లల బాల్యాన్ని కాపాడాలని,Quality విద్య నందించాలని తన లక్ష్యాన్ని వివరిస్తుంటే కలాం తో సహా అందరూ స్పందించారు. తరువాత కలాం గారు గంట సేపు పిల్లలతో Interactive mode లో సంభాషించారు.పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు . కలాం గారు ఇచ్చిన స్పూర్తితో ,సుబ్బారావు గారి సేవను స్మరించుకుంటూ తిరుగు పయన మయ్యాము


4 comments: