Monday 11 May 2015

మనలో సమూలమైన మార్పును తీసుకురాగలమా!(నేడు జిడ్డు కృష్ణ మూర్తి జయంతి )



              "మన జీవితాలలో దౌర్జన్యం నిండి ఉన్నది .కనుక ఈ ప్రపంచం లో జరుగుతూ ఉన్న ప్రతి యుద్దానికి మనదే బాధ్యత. మన జాతీయ భావాలు,స్వార్థ పరత,దేవుళ్ళు ,అసూయలు,ఆదర్శాలు ఇవన్నీ మనను విడదీస్తున్నాయి ఇందులోని యధార్తను మన ఆకలినో బాధనో గమనించేంతటి స్పష్టంగా సూటిగా ప్రపంచంలోని గందరగోళం అంతటికీ మీరు నేను బాధ్యులుం .దుఖాని కంతటికీ మనదే బాద్యత.విభిన్న మైన సంఘాన్ని తయారు చేయటానికి జ్ఞానులు ఏవేవో చెప్పారు.అన్ని మా ర్గాలు సత్యం వంకే నడుస్తాయని చెప్పారు.పరిశీలిస్తే ఇది అసంబద్దం అని తేలిపోతుంది.  సత్యానికి మార్గం,పథం అంటూ ఏమీ లేదు.సత్యానికి సంబంధించిన సుందరత అదే. అది సజీవ మైనది.దానికి విశ్రాంత మందిర మేమీ ఉండదు.ఎవరు మిమ్మల్ని అక్కడికి తీసుకు పోలేరు.ఈ సజీవ వస్తువే మీ స్వస్వరూపం అన్న సంగతి మీరు గమనిస్తారు మీ కోపము మీ దౌర్జన్యము,మీ నిరాశ,మీ బాధలు ఇదంతా అర్థం చేసుకోవడం లోనే సత్యం ఉన్నది. 
            మీరు ఎవరిపైనా ఆధార పడి మనగలగడం అసాధ్యమని తేలి  పోయింది.ఎవరు మార్గ దర్శకులు లేరు ,గురువులు లేరు ఆధిపత్యం లేదు,ఉన్నదంతా మీరే ఇతరులతో మీ సంబంధ బాందవ్యాలు.మీరు నేను మరే బాహ్య సంపర్కము ప్రభావము లేకుండా ఎవరి ప్రోద్భలము,జులుము,శిక్ష పడుతుందేమో అన్న భయం లేకుండా మనలో సమూల మైన మార్పును తీసుకు రాగలమా ?మానసికంగా ఆకస్మిక పరిణామం తీసుకు రాగలమా మనం అప్పుడు క్రూరులం  కాకుండా పై పోటీ మనో భావం లేకుండా ఆదుర్దాలు, భయాలు,అసూయలు,దురాశలు లేకుండా ఇప్పుడు మన జీవితాలలో నిండిపోయిన కుళ్ళు కల్మషము ఏమాత్రము లేకుండా ఉండగలుగుతాము." JK 
(ఈ వ్యాసం జిడ్డు కృష్ణమూ ర్తి బోధనలతో కూర్చిన ప్రచురణ అయిన అంతరంగ యాత్ర నుండి సేకరించినది .వారికి ధన్యవాదాలు )  
మరిన్ని వివరాలకు http://www.jkrishnamurti.org/index.php  వెబ్సైటు ను సందర్శించండి .

Saturday 18 April 2015

సంభాషణలు చర్చలు ఇలావుంటే ఎలావుంటుంది ?

                         మనందరికీ రాజకీయాలు,సినిమాలు,క్రికెట్ ,కులం,మతం ,వ్యక్తీ ,ప్రాంతం,వర్గం,దేశం,తత్వం లాంటి విషయాల పై కొన్ని నిశ్చితాభి ప్రాయాలు ఉంటాయి.సంభాషణల్లోఎదుటి వారి ముందు అవి వ్యక్త పరుస్తుంటాము. అవతలి వారు కూడా తమ అభిప్రాయాలు చెబుతారు.ఇరువైపులా ఒకే రక మైన అభిప్రాయాలు ఉంటె ఓకే.పరస్పరం వ్యతిరేకమయితే ఇక ఘర్షణ మొదలవుతుంది.ఇలా మనసులో ఒక స్థిర అభిప్రాయం లేకుండా ఏ ప్రభావానికి గురి కాకుండా ఒక సమస్యకు కొత్త కోణంలో సత్యం,వాస్తవం ప్రాతిపదికన చర్చించుకునే openmindset  ఏర్పరచుకోవటం ఎంతో అవసరం.అప్పుడే అందులోనుండి మనమేదయినా కొత్త అంశాన్ని అంటే సత్యాన్ని కనుగొనగలం.అప్పుడు అందరం ఆ అభిప్రాయం తో ఏకీభవించ వచ్చు.సమాజంలో అంత తీరిక,ఓపిక,సహనం ఎవరికీ ఉండటం లేదు.మన మధ్య జరిగే విధంగానే T.V  చర్చల్లో,అసెంబ్లీ,పార్లమెంటుల్లో ప్రతిఫలిస్తుంది.కాబట్టి ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా పోతున్నాయి.
           ఈ openmindset ను పెంపొందించుకునే విధంగా విద్యార్థులను చిన్నప్పటినుండితీర్చిదిద్దాలి ఉపాధ్యాయు
లు ముందుగా ఈ ధోరణిని కలిగి ఉంటే విద్యార్థులకు నేర్పగలరు.అలాగే media కూడా ఈ ధోరణిని ప్రోత్సాహిస్తూ చర్చలు చేపడితే చాలా బాగుంటుంది.ప్రతి సంభాషణ నుండి,చర్చలనుండి ఒక కొత్త అంశం నేర్చుకోవటం,ఓ కొత్త సత్యం ఆవిష్కృతం కావటం,ఒక సమస్యకు పరిష్కారం లభించటం,ఓ వాస్తవిక దృక్పథం ఏర్పడటం,ఇవన్నీ వ్యక్తీ ,సమాజం అభివృద్ది చెందటానికి దోహదం చేస్తాయి

Saturday 11 April 2015

మన సంభాషణల్లో జరిగేది ఏమిటి?

         నిత్య జీవితంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉంటాము.వాటి వలన మన మనసులో ఎన్నో అభిప్రాయాలు ఏర్పడి ఉంటాయి.ఇక మన మిత్రుల దగ్గర,బంధువుల దగ్గర ప్రయాణాల్లో మన వైన అభిప్రాయాలు చెబుతూ వెళతాము.అవతలి వారికి అవి నచ్చితే సరి,నచ్చక పోతే వాతావరణం వేడెక్కుతుంది.సంభాషణలో ఎవరి అభిప్రాయాలు వారివి.కాని వాస్తవం లో ఏమి జరుగుతుంది అంటే మన మనసు మనకు నచ్చిన అంశాలనే ఇష్ట పడుతుంది నచ్చని వాటిపట్ల వ్యతిరేకతను ఏర్పరుచుకుంటుంది.అది క్రమంగా ఆ వ్యక్తుల పట్ల వ్యతిరేకంగా మారు తుంది .విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవటం వలన ఈ సమస్య ఏర్పడుతుంది. క్రమంగా నచ్చే మాటలు మాటలు మాట్లాడే వ్యక్తులతో మాత్రమే మనం ఒక సమూహం లో ఏర్పడి ఒకరికి ఇంకొకరు నచ్చేలా మాట్లాడు కుంటూ కాల క్షేపం చేస్తుంటాము.విషయాలు తెలుసుకోవాలనే తపన తగ్గి పోయి మనం అనుకున్నదే సరిఅయినది అనే మిత్ర బృందంతో మాత్రమే జీవితం  గడుపుతూ ఉంటాము .దీనితో జీవితం లో సత్యాలు తెలుసుకునే మార్గాలు మూసు కుంటాము.ఏ విషయంలో నైనా వాస్తవాలు ఏమిటి,సత్యం ఏమిటి అని తరచి చూసుకోగలిగితే సరిపోతుంది.మనం నమ్మినవి మాత్రమే సత్యాలు అనుకుంటే ఎన్నో విషయాలు తెలుసు కాకుండానే ఈ జీవితం ముగిసి పోతుంది. విభిన్న అభిప్రాయాలను గౌరవిద్దాము,అందులో సత్య మెంతో తరచి చూద్దాము.   

Monday 6 April 2015

అబ్దుల్ కలాం ద్వారా శంఖు స్థాపన చేయబడ్డ అనాధల స్కూల్

             పై విషయం పేపర్ లో చూసిన తరువాత అదీ maartur లో అని తెలిసిన తరువాత వెళదామనిపించింది.కానీ ఒక్కడినే ఎలా అనుకున్నాను.సరే ఎప్పుడో ఒక సారి ఆ స్కూల్ ను చూడాలనుకున్నాను.ఆనంద్ ఫోన్ చేసి కార్లో వెడదామా అనటంతో O.K చెప్పేశాను.నేను,ఆనంద్,రంగయ్య ,DVN ప్రసాద్,T.V. శ్రీనివాస్ తో కలిసి బయలుదేరా ను.మేముండే మార్కాపురం నుండి ఒంగోలు మీదుగా నేషనల్ హైవే పై మార్టుర్ దాటిన తరువాత 2 KM లకు శారదా విద్యా నికేతన్ కనిపించింది. అదే అబ్దుల్ కలాం ఆవిష్కరించ బోయే అనాధల school.
             6 గంటల కల్లా అక్కడికి వెళ్ళాము.60 ఎకరాల్లో ఓ 10 ఎకరాల్లో స్కూల్ ఉంది.అక్కడ మాచెర్ల,వినుకొండ లలో పనిచేసే MARG  స్వచ్చంద నిర్వాహకులు పరిచయమయ్యారు.ఈ స్కూల్ కు వారు 60 మంది పిల్లలను పంపారట.కరీముల్లాఖాన్ అనే ఉపాధ్యాయుడి ద్వారా స్థా పించబడి 2000 మంది వివిధ వృత్తులలో పనిచేసే వారు సభ్యులుగా పనిచేస్తున్నదీ సంస్థ.ఆ సంస్థ లోని  M. పాపిరెడ్డి ,B.నాగరాజు పరిచయమయ్యారు వేదికపై శివారెడ్డి (నటుడు) కొద్దిసేపు మిమిక్రీ చేసారు .
             6:15 కల్లా కలాం గారు వేదిక పైకి వచ్చారు.ఈ స్కూల్ ను స్థాపించిన NRI డాక్టర్ పోలినేని సుబ్బారావు తన తల్లి పేరుతో ఫౌండేషన్ స్థాపించి తన 60 ఎకరాలను(60 కోట్లు విలువ చేసే ) ఈ ఫౌండేషన్ కు దానం చేసాడు. ఆయనకు చిన్నతనంలోనే అమ్మా నాన్న చనిపోవటం తో ఆ లోటు తెలుసుకనుక ఈ స్కూల్ ఏర్పాటు చేసారు.తను ఎలా చదువుకుంది,కాలేయ cancer కు  గురయి బయట పడటం గురించి వివరిస్తుంటే కళ్ళు చెమర్చాయి .cbse syllabus తో 12 వ తరగతి వరకు అన్నిసౌకర్యాలతో (AC HOSTEL,LABS) ఏర్పాటు చేసారు.HIV సోకిన పిల్లలు ,అనాధలు ,తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి ఇందులో ప్రవేశం.ప్రస్తుతం 250మంది ఉన్నారు.పిల్లల బాల్యాన్ని కాపాడాలని,Quality విద్య నందించాలని తన లక్ష్యాన్ని వివరిస్తుంటే కలాం తో సహా అందరూ స్పందించారు. తరువాత కలాం గారు గంట సేపు పిల్లలతో Interactive mode లో సంభాషించారు.పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు . కలాం గారు ఇచ్చిన స్పూర్తితో ,సుబ్బారావు గారి సేవను స్మరించుకుంటూ తిరుగు పయన మయ్యాము


Sunday 5 April 2015

kasturibaschool లో 10వ తరగతి అమ్మాయిలకు careerguidence

                         ప్రతి మండలం లో కస్తూరిబా విద్యాలయాల్లో గ్రామీణ ప్రాంత పేద అమ్మాయిలు విద్యనభ్యసి స్తున్నారు.వారిలో చాలా మందికి ఇంటిదగ్గర  ఆర్ధిక పరిస్థితి సరిగాలేక బడిమానేసిన వారినందరిని ఇక్కడచేర్చుకుని శిక్షణ ఇస్తుంటారు.వారికి careergudence&personalitydevelopment లో శిక్షణ నిమ్మని ఉపాధ్యాయ మిత్రుడు సజీవరావు కోరటం తో ఒక ఆదివారం దోర్నాల (దిగువ srisailam) కస్తురిబా స్కూల్ కి వెళ్లాను.నాతోపాటు దోర్నాల మండల పరిషత్ ప్రెసిడెంట్ వేదాంతం ప్రభాకర్ గారు  (ఈయన సజీవరావు అన్న),కరీం (హిందీ లెక్చరర్ ) వచ్చారు.అక్కడ ప్రిన్సిపాల్ అనూష గారు మమ్ము ఆహ్వానించారు.
                       అమ్మాయిలూ చాలా ఉత్సాహంగా ఉన్నారు.ముందు ప్రభాకర్ గారు వారికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు.రాజకీయనాయకుడు అయినా విద్యార్థుల పట్ల ఎంతో ఆపేక్ష ,చదువు పట్ల ఎంతో ఇష్టం కలిగిన వ్యక్తి .తరువాత నేను ఒక గంట పాటు చదువు యొక్క విలువ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్న అవకాశాలు వివరిస్తూ అద్బుత విజయాలు సాధించిన ఇద్దరు మహిళల గురించి వివరించాను.అందులో ఒకరు ఆకురాతి పల్లవి తెలుగు మీడియంలో డిగ్రీ చదివి ,తెలుగు మీడియం లోనే ఐఏఎస్ వ్రాసి 4 వ ప్రయత్నం లో ఎంపికయిన వారు.వారి గురించి "తెలుగు వెలుగు " పత్రిక లో వస్తే ఆ విషయం వివ రించాను. ఇద్దరు అమ్మాయిలూ మేము ఎన్ని కష్టాలు ఎదురయినా ఆమె లాగా ఐఏఎస్ సాధిస్తామని లక్ష్యం పెట్టుకున్నారు.
                      రెండవ మహిళ జ్యోతిరెడ్డి .ఈమె అత్యంత దయనీయ పరిస్థితుల్లో తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకోబోయి విరమించుకుని పట్టుదలతో అమెరికా వెళ్లి అక్కడ కంపెనీ పెట్టి ప్రస్తుతం తన లాంటి ఎందఱో పేదవారికి సాయం చేస్తున్నారు.ఈ రెండు ఉదాహరణలతో వారిలో ఎంతో పట్టుదల కలిగి వారి వారి లక్ష్యాలను వివరించారు.ఇలా ఆరోజు వారికి చెప్పిన విషయాలతో వారిజీవితం లో కొద్ది మార్పు వచ్చినా చాలు.
             అదేరోజు త్రిపురాంతకం లో సజీవరావు,కరీంముల్లా (PSTeacher ),కరీం గారి ఆధ్వర్యంలో 40 మంది S.C మరియు ,ST పిల్లలకు కూడా ఇదేవిధమైన class నిర్వహించాము. ఆ పిల్లలు కూడా చాలా బాగా విన్నారు .అక్కడ కూడా ఒక విద్యార్థి ఐఏఎస్ లక్ష్యం పెట్టుకోగా మిగిలిన వారందరూ విభిన్న వృత్తులను ఎన్నుకున్నారు . ఈ రెండు కార్యక్రమాలను SAPS అనే స్వచ్చంద సంస్థ నిర్వహించింది .దీనిని వేదాంతం ప్రభాకర్ గారు,సజీవరావు ,కరీం కరీముల్లా నిర్వహిస్తున్నారు . వారిని ప్రత్యేకంగా అభినందించాను .మొదటి ఫోటోలో మాట్లాడుతున్నది వేదాంతం ప్రభాకర్ గారు,కూర్చున్న వారిలో మొదట నేను ,సజీవరాజు ,కరీం,అనూష Principal   (వరుసగా).
      

  రెండవ ఫోటోలో శిక్షణ నిస్తున్న నేను (ఒద్దుల రవిశేఖర్)   

Sunday 8 March 2015

RMSA లో DRP గా 5 రోజుల శిక్షణ

      RMSA లో  DRP(District resource person) గ  నేను,నాగమూర్తి,సజీవరావు,రఘురాం ఎన్నిక  కావటం తో  28/1/15 night hyderabad బయలుదేరాము.బస్సులో కిటికీ సరిగా మూసుకోక పోవటంతో బాగా అసౌకర్యానికి గురయ్యాము. ఇంకొక విషయం ఏంటంటే 11 గంటలకు బస్సు బయలు దేరింది. సినిమా పెట్టారు నేను నిద్ర పోవాలి ఆపమన్నాను.ఇంకొకరు పెట్టమన్నారు. రోజు T.V  లో 10 సినిమాలు వస్తుంటాయి .అయినా రాత్రి ప్రయాణం లో సినిమా కావా లంటారు .ఇదొక ప్రొబ్లెమ్.చివరకు డ్రైవర్ సినిమా తీసేసాడు .
         ఉదయం హైదరాబాద్ లో దిగేసరికి విపరీతమైన చలి. గచ్చిబౌలి లోని టెలికాం సెంటర్ కు చేరుకొని రిఫ్రెష్ అయ్ ఉదయం తరగతులకి  హాజరయ్యాము.మారిన 9,10 తరగతుల physical science textbooks పై  training మొదలయ్యింది.ఆనంద్ (text book writer,SRP)విద్యుత్ ,కాంతి పై చక్కటి అవగాహన కలిగించారు. ఆయనకు   ఫిజిక్స్ పై ఎంత ఇష్టం, పట్టు ఉందొ ఆ చెప్పే  విధానం బట్టి అర్థమవుతుంది.1200 పుస్తకాలతో కూడిన ఫిజిక్స్ లైబ్రరీ ఆయన ఇంట్లో ఉందిట.టీచర్స్ చాలా ప్రేరణ పొందారు .
         నెల్లూరు నుండి ఎ.వి  సుధాకర్  organic chemistry గురించి చెప్పారు. ఈయన scert  తరపున ల్యాబ్ బుక్స్ , సాక్షి భవితలో 10 వ తరగతి physicalscience పై వ్రాస్తున్నారు.నేను సుధాకర్ కలిసి మైసూరు లో జరిగిన కంప్యూటర్ ఎడ్యుకేషన్ శిక్షణకు(NCERT ) వెళ్లి వచ్చాము. ఇంకా కెమిస్ట్రీ  లో ఏకాంబరం,సుబ్రహ్మణ్యం,గురుప్రసాద్ మిగతా తరగతులు  తీసుకున్నారు.చివర్లొ  విద్య,సైన్స్ వెనుక ఉన్న ఫిలాసఫీ ని రమేష్(academic incharge,scert) అద్భుతంగా  వివరించారు.మిత్రు లంతా   smartphones తో  record చేసుకున్నారు. తరువాత A.P STATE  physicalscience teachers forum  ఏర్పడింది .
.