Tuesday 24 December 2013

ఈ సహస్రాబ్ది వ్యక్తి (Man off the millennium)


 
      ఎలా ఈయన అంత గుర్తింపు తెచ్చుకున్నాడు అని తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఆయన పేరు కళ్యాణ సుందరం. ఆయనది తమిళనాడు రాష్ట్రం.చేసే ఉద్యోగము librarian.భారతదేశంలో అత్యుత్తమ librarian గా కేంద్ర ప్రభుత్వ సత్కారం పొందాడు. ప్రపంచంలోని 10 మంది అత్యుత్తమ librarians లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇవన్నీ ఒక ఎత్తు .
          45 సం రాల నుండి సంఘసేవకు తన జీవితాన్ని అంకితం చేసాడు.వివాహము చేసుకోలేదు. 30 సం లుగా తన జీతం మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాడు.మరి తన ఖర్చులకు డబ్బు ఎలా అని ఆశ్చర్య పోతు న్నారా! ఒక హోటల్ లో సాయంత్రం పనిచేస్తూ వారిచ్చేజీతంతో తన పరిమిత అవసరాలు తీర్చుకుంటాడు.రిటైర్ అయిన తరువాత వచ్చిన 10 లక్షలను సంఘసేవకే కేటాయించాడు.ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఓ అమెరికన్ సంస్థ ఈయనను Man of the millennium గా ప్రకటించి 30 కోట్ల రూపాయలను బహుమతిగా అందించింది ఇక చెప్పేదేముంది ఈ మొత్తం కూడా దానధర్మాలకే వినియోగించాడు .
         ఈ విషయాలన్నీ గమనించిన రజనీకాంత్ ఎంతో ఆలోచించాడట ఆయన గురించి !అన్నీ ఇచ్చే చెట్టు గొప్పదా! చెట్టుని రక్షించేవాడు గొప్పవాడా! ఈ ఆలోచన తర్వాత రజనీకాంత్ మనసులో ఆయన ఓ జైన విగ్రహంలా ఎదిగారట  కల్యాణ సుందరం గారిని తన తండ్రిగా రజనీకాంత్ స్వీకరించారు.
           డబ్బు ఎంతున్నా తల్లిదండ్రులను ఆదుకోవడానికి అవేవీ పనికిరావు వారిని మనమే చూసుకోవాలి అన్న సందేశం ఈ దత్తత లో మనకు అర్దమవుతుంది.
           (ఈ కథనం ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలోనిది .వారికి ధన్యవాదాలు ) 

Sunday 15 December 2013

దేవుడి భాషను చెప్పిన కుర్రాడు


             చిన్న జ్వరానికి,జలుబుకే కంగారు పడిపోతాం. కానీ అమెరికాకు చెందిన Myatee stepaneck నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అతని 13 ఏళ్ళ జీవితంలో సాధించిన విజయాలు 1)అతడు వ్రాసిన కవితల పుస్తకాలు అమెరికాలో అత్యధికంగా అమ్ముడు పోయిన పుస్తకాల జాబితాలో స్థానం సంపాదించాయి.2)ప్రతిష్టాత్మక మైన మెలిండా ఎ లారెన్స్  పేరిట ఉన్నఅంతర్జాతీయ బుక్ అవార్డు గెలుచుకున్నాడు.3) తన లాంటి రోగుల కోసం దేశ మంతా తిరిగి విరాళాలు సేకరించి ఇచ్చాడు.3)ఎన్నోబహిరంగ సభల్లోపాల్గొన్నాడు,ఎన్నోటి .వి కార్యక్రమాల్లో పాల్గొ న్నాడు 4)అమెరికాలోని ప్రముఖులు అతని మిత్రులు .
            పుట్టినప్పటి నుంచి అతనికి ఓ అరుదైన వ్యాధి ఉంది.అది mascular dystrophy . ఈ వ్యాధితోనే అతని అన్నలు చనిపోయారు .చక్రాల కుర్చీ లేనిదే కదలలేడు.వారానికి ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాలి ఊపిరి పీల్చుకోవాలంటే ఒక యంత్రం పనిచేయాల్సిందే!ఆహారం గొంతులోకి గొట్టాల ద్వారా ఇవ్వాలి.ప్రతి రాత్రి నరాల ద్వారా సూదులు తప్పని సరి.ఎన్ని బాధలు !ఎంత కష్టం !
          ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అతడు ఎప్పుడూ ఆనందంగా ఉండడం గురించి !నిరాశకు గురవకుండా అతను వ్రాసిన వేలాది కవితల గురించి.కవితలు కథలు వ్రాసేవాడు. శాంతి,ఆశ ప్రేమ జీవితం ప్రకృతి విచారం వైకల్యం లాంటి అంశాలపై ఎన్నో వ్యాసాలూ వ్రాసాడు. మ్యాటీ ని కలుసుకోవడం నా ఆశయాల్లో ఒకటి అన్నాడు జిమ్మీ కార్టర్. 
ఒఫ్రా విన్ఫ్రే ,ల్యారీ కింగ్ లాంటి ప్రముఖులు అతని కార్యక్రమాల్లో పాల్గొన్నారు .
     అతని భావాలలో కొన్ని
       *దేవుడికి నచ్చిన భాష పిల్లల భాష
     *నేను పెద్ద అవుతాననే నమ్మకం నాకు లేదు కానీ పెద్దవ్వాలనే కోరిక ఉంది . నాకు కథలు కవితలు ఇష్టం అందుకే రచయితను అవుతాను
* అందరి జీవితాల్లోను తుపానులు ఉంటాయి దీన్ని అందరు తెలుసుకోవాలి ప్రతి తుపాను తర్వాత మనం ఆడు కోవాలి.  జీవితమనే బహుమతి లభించినందుకు మనం ఆనందించాలి. 
*మనందరం ఒకే భూమి మీద ఉన్నాం. మన అందరికీ ఒకటే హృదయం ఉంది ఒకే జీవితం ఉంది అందుకే మన అందరం ఒకే కుటుంబం లా ఉండాలి
* నాకు ప్రతి రోజు ఒక బహుమతే! ఎందుకంటే ఎప్పుడు చనిపోతానో తెలియదు.కాబట్టి నాకు బలం దేవుడి నుంచి,అమ్మ నుంచి నాకు ఎదురయిన మనుషుల నుంచి లభిస్తోంది .
    చూడండి ఎంత ఆశావాదం! చిన్న విషయాలకే ఆత్మ హత్య చేసుకునే వారు,జబ్బుల బారిన పడి జీవితం పట్ల విరక్తి చెందిన  వారు అతని నుండి ఎంతో స్పూర్తి పొందవచ్చు.మ్యాటినీ తన 13 వ ఏట చనిపోయాడు గొప్ప స్పూర్తిని  ప్రపంచానికి అందించి.
  ( ఈ కథనం ఈనాడు పత్రిక లో వచ్చింది.వారికి ధన్యవాదాలు )