Sunday 5 April 2015

kasturibaschool లో 10వ తరగతి అమ్మాయిలకు careerguidence

                         ప్రతి మండలం లో కస్తూరిబా విద్యాలయాల్లో గ్రామీణ ప్రాంత పేద అమ్మాయిలు విద్యనభ్యసి స్తున్నారు.వారిలో చాలా మందికి ఇంటిదగ్గర  ఆర్ధిక పరిస్థితి సరిగాలేక బడిమానేసిన వారినందరిని ఇక్కడచేర్చుకుని శిక్షణ ఇస్తుంటారు.వారికి careergudence&personalitydevelopment లో శిక్షణ నిమ్మని ఉపాధ్యాయ మిత్రుడు సజీవరావు కోరటం తో ఒక ఆదివారం దోర్నాల (దిగువ srisailam) కస్తురిబా స్కూల్ కి వెళ్లాను.నాతోపాటు దోర్నాల మండల పరిషత్ ప్రెసిడెంట్ వేదాంతం ప్రభాకర్ గారు  (ఈయన సజీవరావు అన్న),కరీం (హిందీ లెక్చరర్ ) వచ్చారు.అక్కడ ప్రిన్సిపాల్ అనూష గారు మమ్ము ఆహ్వానించారు.
                       అమ్మాయిలూ చాలా ఉత్సాహంగా ఉన్నారు.ముందు ప్రభాకర్ గారు వారికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు.రాజకీయనాయకుడు అయినా విద్యార్థుల పట్ల ఎంతో ఆపేక్ష ,చదువు పట్ల ఎంతో ఇష్టం కలిగిన వ్యక్తి .తరువాత నేను ఒక గంట పాటు చదువు యొక్క విలువ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్న అవకాశాలు వివరిస్తూ అద్బుత విజయాలు సాధించిన ఇద్దరు మహిళల గురించి వివరించాను.అందులో ఒకరు ఆకురాతి పల్లవి తెలుగు మీడియంలో డిగ్రీ చదివి ,తెలుగు మీడియం లోనే ఐఏఎస్ వ్రాసి 4 వ ప్రయత్నం లో ఎంపికయిన వారు.వారి గురించి "తెలుగు వెలుగు " పత్రిక లో వస్తే ఆ విషయం వివ రించాను. ఇద్దరు అమ్మాయిలూ మేము ఎన్ని కష్టాలు ఎదురయినా ఆమె లాగా ఐఏఎస్ సాధిస్తామని లక్ష్యం పెట్టుకున్నారు.
                      రెండవ మహిళ జ్యోతిరెడ్డి .ఈమె అత్యంత దయనీయ పరిస్థితుల్లో తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకోబోయి విరమించుకుని పట్టుదలతో అమెరికా వెళ్లి అక్కడ కంపెనీ పెట్టి ప్రస్తుతం తన లాంటి ఎందఱో పేదవారికి సాయం చేస్తున్నారు.ఈ రెండు ఉదాహరణలతో వారిలో ఎంతో పట్టుదల కలిగి వారి వారి లక్ష్యాలను వివరించారు.ఇలా ఆరోజు వారికి చెప్పిన విషయాలతో వారిజీవితం లో కొద్ది మార్పు వచ్చినా చాలు.
             అదేరోజు త్రిపురాంతకం లో సజీవరావు,కరీంముల్లా (PSTeacher ),కరీం గారి ఆధ్వర్యంలో 40 మంది S.C మరియు ,ST పిల్లలకు కూడా ఇదేవిధమైన class నిర్వహించాము. ఆ పిల్లలు కూడా చాలా బాగా విన్నారు .అక్కడ కూడా ఒక విద్యార్థి ఐఏఎస్ లక్ష్యం పెట్టుకోగా మిగిలిన వారందరూ విభిన్న వృత్తులను ఎన్నుకున్నారు . ఈ రెండు కార్యక్రమాలను SAPS అనే స్వచ్చంద సంస్థ నిర్వహించింది .దీనిని వేదాంతం ప్రభాకర్ గారు,సజీవరావు ,కరీం కరీముల్లా నిర్వహిస్తున్నారు . వారిని ప్రత్యేకంగా అభినందించాను .మొదటి ఫోటోలో మాట్లాడుతున్నది వేదాంతం ప్రభాకర్ గారు,కూర్చున్న వారిలో మొదట నేను ,సజీవరాజు ,కరీం,అనూష Principal   (వరుసగా).
      

  రెండవ ఫోటోలో శిక్షణ నిస్తున్న నేను (ఒద్దుల రవిశేఖర్)   

4 comments: